‘నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. మేడే మేడే’.. పైలట్ చివరి నాలుగు మాటలివే

‘నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. మేడే మేడే’.. పైలట్ చివరి నాలుగు మాటలివే

గాంధీనగర్: అహ్మదాబాద్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక్క ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ చనిపోయారు. విమానం క్రాష్ కావడానికి ముందు ఎయిర్ ఇండియా పైలట్ సుమిత్ సభర్వాల్ అహ్మదాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి అత్యవసర సమయాల్లో చేసే మేడే కాల్ చేశారు.

‘నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. మేడే మేడే’ అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి సందేశం పంపాడు. విమానంలో పవర్ లేదని.. కమ్యూనికేషన్ లైన్ కూడా చాలా బలహీనంగా ఉందని ఏటీసీకి వివరించాడు. పైలెట్ సుమిత్ పంపిన ఈ 5 సెకన్ల సందేశం ఏటీసీలో రికార్డ్ అయ్యింది. ఏటీసీ తిరిగి స్పందించగా అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏటీసీకి మేడే కాల్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ప్లయిట్ క్రాష్ అయ్యింది. 

కాగా, గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. 

ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్‎పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ సజీవ దహనమయ్యారు. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. 

భారత దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చిన ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యా్ప్తునకు ఆదేశించింది. అధికారులు ఇప్పటికే ఘటన స్థలం నుంచి విమానంలోని బ్లాక్ బాక్స్ సేకరించి విశ్లేషిస్తు్న్నారు. ప్లయిట్ క్రాష్ కావడానికి గల కారణమేంటి.. విమానం కుప్పకూలడానికి ముందు కాక్ పిట్‎లో జరిగిన సంభాషణ గురించి ఆరా తీస్తున్నారు.