- నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్
గండిపేట, వెలుగు: పట్టపగలు చైన్ స్నాచింగ్ ముఠా నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి, దాడి చేసింది. అతడి మెడలోని10 తులాల గోల్డ్చైన్ను లాక్కొని పరారైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కన్నయ్యలాల్ అనే వ్యాపారి సన్సిటీలో స్వీట్ షాప్నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం కారులో మెహిదీపట్నం నుంచి రాజేంద్రనగర్ బయలుదేరాడు. పిల్లర్ నెంబర్182 వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా ఐదుగురు వ్యక్తులు కన్నయ్య లాల్కారును ఆపారు. అతడిని బయటికి లాగి పిడుగుద్దులు గుద్దారు. మెడలోని 10 తులాల గోల్డ్చైన్ను లాక్కుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.