జయశంకర్ ​పరిశోధన కేంద్రం వద్ద పులి అడుగులు

జయశంకర్ ​పరిశోధన కేంద్రం వద్ద  పులి అడుగులు


వర్ని, వెలుగు: రుద్రూర్‌‌ మండలంలోని అక్బర్‌‌నగర్‌‌ శివారులో ఉన్న ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​అధికారులు గుర్తించారు.

పరిశోధన కేంద్రం సమీపంలో అడవి పంది మృతిచెందిన సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్​ఆఫీసర్లు చంద్రప్రకాశ్‌‌, బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి అడవిపందిని పులి చంపినట్లు నిర్ధారించారు. ఆ ప్రాంత పరిసరాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.