తిరుమల కొండపై లక్ష మందిపైనే భక్తులు : వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తిన జనం

 తిరుమల కొండపై లక్ష మందిపైనే భక్తులు : వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తిన జనం

తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి.  తిరుమల కొండకు భారీగా భక్తులు తరలి వచ్చారు.  శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ తోపాటు  వేసవి సెలవులు  ముగింపు దశలో ఉండటంతో  తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు  పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.  అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులలో సైతం కాలినడకన తిరుమల వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తిరుమల సప్తగిరులు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. 

ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి శిలాతోరణం వరకు 2 కిమీ వరకు బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.  దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ ( SSD) దర్శనానికి 6 గంటలు, 300/- రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి .. 5 గంటల సమయం పడుతోంది. 

శుక్రవారం ( జూన్​ 5) తిరుమల శ్రీవారిని  72వేల 174 మంది భక్తులు దర్శించుకోగా.. 35వేల192 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం  2. 88 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 

భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు..  శ్రీవారి సేవకుల ద్వారా పాలు, నీళ్ళు, అన్న ప్రసాదాలు పంపిణి చేస్తున్నారు... టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.