తిరుపతి విమానాశ్రయంలో VIP లాంజ్

తిరుపతి విమానాశ్రయంలో VIP లాంజ్

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి  విమానాశ్రయంలో సరికొత్త వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవాళ భేటీ అయిన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీకి చెందిన 1800 చదరపు మీటర్ల భూమిని ఏపీ విద్య,సంక్షేమ,మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కు కేటాయించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ భూమిలోనే వీఐపీ లాంజ్ నిర్మాణం చేయనున్నారు. ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో 15 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది.