
హైదరాబాద్, వెలుగు: తెలంగాణయంగ్ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి జకర్తాలో జరిగిన ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్ తన పార్ట్నర్ సిద్ధాంత్ భాటియాతో కలిసి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాయి కార్తీక్–సిద్ధాంత్ (ఇండియా) 6–7 (3–7), 7–5, 10–5తో జపాన్కు చెందిన ఫుకుడా సోరా– తొమోహిరో మయాసబాషిపై ఉత్కంఠ విజయం సాధించారు.