పాత పెన్షన్ సాధన రథయాత్రకు టీఎన్జీవో మద్దతు

పాత పెన్షన్ సాధన రథయాత్రకు టీఎన్జీవో మద్దతు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న పాత పెన్షన్‌ సాధన సంకల్ప రథయాత్రకు టీఎన్జీవో యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్(సీపీఎస్) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వెల్లడించారు. ఆగస్ట్12న జరగబోయే చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ కు కూడా టీఎన్జీవో సపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ఆఫీస్ లో టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్​తో కలిసి రథయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా రాజేందర్​మాట్లాడుతూ..పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర, చలో హైదరాబాద్ కార్యక్రమాలకు  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాముల్లో  సీపీఎస్ ఉద్యోగులతోపాటు పాత పెన్షన్ ఉన్న వారు కూడా పాల్గొనాలని కోరారు. సీపీఎస్ యూనియన్ నేతలు త్వరలో సీఎం కేసీఆర్​ను కలవనున్నట్లు చెప్పారు.