రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోందని తెలియజేశారు.
లవ్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి ఎమోషన్స్తోపాటు యూత్కు మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీసీ క్రిష్ సంగీతాన్ని అందించాడు.
