అశ్వారావుపేట, వెలుగు: రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబంలో కరోనా పెను విషాదాన్ని మిగిల్చింది. కరోనాతో ఓ మహిళ చనిపోగా డెడ్బాడీని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ను అడిగితే రూ.15 వేలు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త నారంవారి గూడెం కాలనీకి చెందిన జి.మాణిక్యం(45) ఈ నెల 17న కరోరా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. 18న బ్రీతింగ్ ప్రాబ్లం రావటంతో కుటుంబసభ్యులు కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి చనిపోయింది.
డెడ్బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటంబ సభ్యులు అంబులెన్సును అడిగారు. 90 కిలోమీటర్ల దూరంలోని ఊరికి రూ. ఐదు లేదా ఆరు వేలకు మించి తీసుకోకూడదు. కానీ ఎన్ని అంబులెన్సులను అడిగినా రూ. 15 వేలకు తక్కువ చెప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పవన్కల్యాణ్ సేవా సమితి అధ్యక్షుడు డేగల రామచంద్ర రావు అంబులెన్స్ పంపించి బాడీని గ్రామానికి తరలించారు.ని కోరారు.