అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 56,569 నమూనాలు పరీక్షించగా 6,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749 కు చేరిందని.. తాజా పరీక్షల్లో 30,085 ట్రూనాట్ పద్ధతిలో, 26,484 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారని చెప్పింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 51 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5410 కు చేరిందని తెలిపింది.
24 గంటల్లో 10,502 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారని.. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్ ను జయించారని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 74,518 యాక్టివ్ కేసులున్నాయని తెలిపిన ఆరోగ్యశాఖ.. ఈమేరకు సోమవారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 51,60,700 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.