
నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చండూరులో శుక్రవారం మనోధైర్య సభ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో సభ జరగనుంది. కార్యక్రమానికి భారీగా జనాన్ని తరలించాలని భావిస్తున్న లీడర్లు.. ప్రతి మండలానికి ఒక కమిటీని వేశారు. మీటింగ్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ కె.జానారెడ్డి, ప్రచార కమిటీ నాయకులు మధుయాష్కీగౌడ్, సీతక్క, అంజన్కుమార్ యాదవ్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.