గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో వ్యవసాయ పొలంలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. చిన్నారి ఆ ప్రాంతంలో ఆడుకుంటుండగా గుంతలో పడినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం స్థానిక అధికారులు చిన్నారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
జామ్నగర్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని తమచన్ గ్రామంలోని పొలంలో కూలీలుగా పనిచేస్తున్న గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి ఆడుకుంటూ దాదాపు 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిందని జామ్నగర్ తాలూకా అభివృద్ధి అధికారి ఎన్ఎ సర్వయ్య తెలిపారు. ఈ ఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు. “మేము జామ్నగర్ నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బందిని కలుపుకొని ఉదయం 11 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాము. బాలిక దాదాపు 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సర్వయ్య చెప్పారు.