బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు సిల్వర్ మెడల్

బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు సిల్వర్ మెడల్

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్ దక్కింది. బ్యాడ్మింటన్ మెన్ సింగిల్స్ SL4 విభాగంలో... సుహాస్  యతిరాజ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. ఫైనల్ ఫ్రాన్స్ ప్లేయర్ ల్యూకాస్ మజూర్ తో తలపడిన సుహాస్... 2-1తో ఓడిపోయాడు. దీంతో సిల్వర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిల్వర్ సాధించిన సుహాస్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అభినందించారు. IAS అధికారి అయిన సుహాస్... ఉత్తరప్రదేశ్ లోని గౌతమబుద్ధనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు.