ప్రముఖ కమెడియన్ మృతి

ప్రముఖ కమెడియన్ మృతి

టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అల్లు రమేశ్ కన్నుమూశారు. నెపోలియన్ సినిమాతో పాటు.. 'మా విడాకులు' అనే వెబ్ సిరీస్‌లో ఆయన యాక్ట్ చేశారు. అల్లు రమేశ్ కు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఒక మంచి కమెడియన్ ని కోల్పోయిందన్నారు.

విశాఖపట్టణానికి చెందిన అల్లు రమేశ్ పలు నాటకాల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో కనిపించారు. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ‘మా విడాకులు’ వెబ్ సిరీస్‌ ద్వారా గుర్తింపు పొందారు. దీంతో పాటు తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి మరికొన్ని సినిమాల్లో నటించారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా.. తనదైన ప్రత్యేక కోస్తా యాసతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.