
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. బాలకృష్ణ ‘వీరభద్ర’, సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలకు ఏఎస్ రవికుమార్ డైరెక్టర్. రవికుమార్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘తిరగబడర సామీ’. గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమాకి కూడా దర్శకుడు రవికుమార్ కావడం గమనార్హం. ‘తిరగబడర సామీ’ సినిమా డిజాస్టర్ అయింది. కనీస వసూళ్లను సాధించలేక బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫెయిల్యూర్గా మిగిలింది. నిర్మాతను నష్టాల్లోకి నెట్టేసింది.
ఈ పరిణామం.. ‘తిరగబడర సామీ’ పరాజయంతో ఏఎస్ రవికుమార్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. రవికుమార్ చౌదరి మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం ప్రకటించారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘యజ్ఞం’ సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చిన మంచి కమర్షియల్ హిట్స్. రవికుమార్ దర్శకత్వం వహించిన చిత్రాలు: యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘సౌఖ్యం’, ‘లేడీ బ్రూస్ లీ’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘తిరగబడరా సామీ’. నితిన్ ‘ఆటాడిస్తా’, బాలకృష్ణ ‘వీరభద్ర’ సినిమాలు అట్టర్ ప్లాప్గా మిగిలిపోయాయి.