తెలంగాణ ప్రభుత్వం టెట్నోటిఫికేషన్కు ఏర్పాట్లు చేస్తోంది. టెట్ నిబంధనల్లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సవరించిన తర్వాతే టెట్పెట్టాలి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి(ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం.. డీఎడ్, డిగ్రీ పూర్తి చేసిన వారికి టెట్పేపర్2లోనూ అవకాశం ఇవ్వాలి. ఈ రూల్ప్రకారమే సెంట్రల్టెట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాలుగు సార్లు అవకాశం కల్పించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు సార్లు నిర్వహించిన టెట్లో అధికారుల తప్పిదాల వల్ల డిగ్రీ, డీఎడ్చేసిన వారికి పేపర్2లో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే టెట్పేపర్2లో చాన్స్ఇవ్వాలి. దీంతోపాటు పేపర్2లో బయాలజీ అభ్యర్థులకు అసలు సంబంధమే లేని గణితం నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయి. దీని వల్ల ఎక్కువ మంది బయాలజీ అభ్యర్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయలేక తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వారికి గణితం ప్రశ్నల నుంచి విముక్తి కల్పించాలి. ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న చివరి సంవత్సరం విద్యార్థులకూ టెట్రాసే వెసులుబాటు కల్పించాలి. త్వరలో పెట్టబోయే టెట్ కు డీఎడ్, బీఎడ్ సెకండ్ఇయర్ చదువుతున్న స్టూడెంట్లను అనుమతించాలి.
- రావుల రామ్మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం