చేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా

చేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా

ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఏపీ: చేపలు రవాణా చేసే బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. కృష్ణాజిల్లా నుండి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కైకలూరు కలిదిండి మండలం పోలీసులు రాత్రి వాహనాల తనిఖీలో తాబేళ్లను తరలించే ముఠా పట్టుబడింది. సానారుద్రవరం గ్రామం వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆటో ట్రాలీ వచ్చింది. బాక్సుల్లో చేపలు తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా సుమారు టన్ను తాబేళ్లు దొరికాయి. పోలీసులు తాబేళ్లను స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  నిందితులను అదుపులోకి తీసుకున్నారు.