ప్రైవేటు బాటలో.. 4 సర్కారీ బ్యాంకులు

 ప్రైవేటు బాటలో.. 4 సర్కారీ బ్యాంకులు
  • బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర
  • బ్యాంక్​ ఆఫ్​ ఇండియా
  • ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​
  • సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్​మెంట్​ ద్వారా నిధులను సమకూర్చుకోవడానికి 4 ప్రభుత్వ బ్యాంకులను అమ్మాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలను ప్రైవేటైజ్​ చేస్తారని సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో వేలాది మంది పనిచేస్తారు. వీటిని ప్రైవేటైజ్​ చేస్తే, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఈ విషయంలో వెనకడుగు వేయకూడదని మోడీ ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు బ్యాంకుల్లో రెండింటిని 2021–2022 ఆర్థిక సంవత్సరంలోనే అమ్మేస్తారు. సెంట్రల్​ బ్యాంక్ వంటి మిడ్​సైజ్​డ్​ బ్యాంకుల అమ్మకం ప్రయోగం సక్సెస్​ అయితే పెద్ద బ్యాంకులనూ ప్రైవేటైజ్​ చేయవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే స్టేట్​ బ్యాంకులో మాత్రం మెజారిటీ వాటా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కరోనా వల్ల ఎకానమీ తీవ్రంగా దెబ్బతిన్నందున, ఇలాంటి భారీ మార్పులకు ప్రభుత్వం రెడీ కావాల్సిందేనని ఎకనమిస్టులు అంటున్నారు. ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండగా మారాయి. బ్యాంకింగ్​ సెక్టార్లో రిఫార్మ్స్​ తీసుకురావడం ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్​ ఇండియాలో 50 వేల మంది, సెంట్రల్​ బ్యాంకులో 33 వేల మంది, ఇండియన్​ ఓవర్సీస్ బ్యాంక్ లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్రలో 13 వేల మంది పనిచేస్తున్నారు. ప్రైవేటైజేషన్​ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ​

For More News..

ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంకింగ్స్‌‌.. రాహుల్‌ @ 2

సరదాగా ‘ఫేక్ ఇగ్లూ’ యాడ్ ఇస్తే.. దిమ్మతిరిగింది

ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది