టీఆర్ఎస్, బీజేపీల చీకటి దోస్తీ బట్టబయలైంది : రేవంత్

టీఆర్ఎస్, బీజేపీల చీకటి దోస్తీ బట్టబయలైంది : రేవంత్

టీఆర్ఎస్, బీజేపీల చీకటి దోస్తీ ప్రజలకు అర్ధమైపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమార డ్రామాలు మాని రాష్ట్రంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం పరిపాలన, ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని సూచించారు. ఈమేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజా క్షేత్రంలో తగిన శాస్తి తప్పదన్నారు. మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ వైపు నిలబడాలని ప్రజలను కోరారు.