
- టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్రెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని టీపీసీసీ జనరల్సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయన్నారు.
తనకు పదవి ఇచ్చిన పీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎంపీ సురేశ్శెట్కార్లకు ధన్యవాదాలు తెలిపారు. మీటింగ్లో జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్లు సుతారి రమేశ్, నౌషిలాల్, అనంతారెడ్డి, యాదవరెడ్డి, నాయకులు విజయ్కుమార్రెడ్డి, తిరుమల్గౌడ్
తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి : టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్తానన్నారు. కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్దృష్టికి తీసుకెళ్తానన్నారు. కామారెడ్డి టౌన్ అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.