‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి : ఇంద్రకరణ్రెడ్డి

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి : ఇంద్రకరణ్రెడ్డి
  • టీపీసీసీ  జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని టీపీసీసీ జనరల్​సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కాంగ్రెస్​పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయన్నారు. 

తనకు పదవి ఇచ్చిన పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​గౌడ్, ఏఐసీసీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​, సీఎం రేవంత్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎంపీ సురేశ్​శెట్కార్​లకు ధన్యవాదాలు తెలిపారు.  మీటింగ్‌లో  జిల్లా లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్లు సుతారి రమేశ్,  నౌషిలాల్, అనంతారెడ్డి, యాదవరెడ్డి, నాయకులు  విజయ్​కుమార్​రెడ్డి, తిరుమల్​గౌడ్ 
తదితరులు పాల్గొన్నారు.  

పార్టీ బలోపేతానికి కృషి :  టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి

 పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు.   పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్తానన్నారు.  కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్ కుమార్​గౌడ్​దృష్టికి తీసుకెళ్తానన్నారు.  కామారెడ్డి టౌన్​ అభివృద్ధి కోసం ఫండ్స్​ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.