సర్కారు బడుల దుస్థితిపై రేవంత్ రెడ్డి ట్వీట్

సర్కారు బడుల దుస్థితిపై రేవంత్ రెడ్డి ట్వీట్
  • కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా సర్కారు బడులు
  • నీ పాలనలో బడి పిల్లల ప్రాణాలకు భరోసా లేదు

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో సర్కారు బడుల పరిస్థితి దారుణంగా మారిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉద్యమ ద్రోహి కేసీఆర్ హయాంలో పైలం బిడ్డా బడికి పోతున్నావు అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు చదువుకునేందుకు చోటు లేదు.. పుస్తకాలు లేవు... చదువు చెప్పేందుకు గురువులు లేరని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏ పాఠశాలను చూసినా పెచ్చులూడిన గోడలు, కూలిపోయిన గదులే కనిపిస్తాయన్నారు. ఇక విద్యార్థులకు పురుగుల పట్టిన అన్నం, కలుషిత తాగునీరు అందిస్తున్నారన్న రేవంత్... ‘మన ఊరు–మన బడి’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారన్న రేవంత్...  ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందన్నారు.