మహబూబ్నగర్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

మహబూబ్నగర్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై మహిళ అధ్యక్షురాలు సునీతరావు సమీక్ష నిర్వహించారు. మహిళల కమిటీలు ఏర్పాటు చేయడంలో జిల్లా కాంగ్రెస్ విఫలమైందంటూ సునీతరావు అసహనం వ్యక్తం చేశారు.

చేతకాకపోతే రాజీనామా చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితారెడ్డిపై సునీతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అనితారెడ్డి కంటతడి పెట్టారు. ఇదే ఇష్యూపై సునీతారావును ఓ కార్యకర్త ప్రశ్నించటంతో వివాదం ముదిరింది. మహిళల సమావేశంలోకి వచ్చి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.