ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

శామీర్ పేట, వెలుగు: శామీర్  పేట పరిధిలోని హైదరాబాద్– -కరీంనగర్ రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలియాబాద్ ఎక్స్​రోడ్డు సమీపంలో ఖాళీ లోడ్​తో ముందు వెళ్తున్న ట్రాక్టర్​ను లారీ వెనుక నుంచి ఓవర్​స్పీడ్​తో ఢీకొట్టింది. 

ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు ముక్కలుగా విరిగిపోగా, ట్రాక్టర్​డ్రైవర్​మృతి చెందాడు. మృతుడిని అలియాబాద్​కు చెందిన ఆకాష్ ఉత్తమ్ సోన్ కాంబ్లే (31)గా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్​పై ఉన్న మరొక వ్యక్తి జగదేవ్​కు తీవ్ర గాయాలు కాగా, ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో శామీర్​పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.