జీడిమెట్ల, వెలుగు: గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ మార్షల్ సీపీఆర్ చేసి రక్షించారు. సూరారం చౌరస్తాలో రహీం అనే వ్యక్తి శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ మార్షల్ శివకుమార్ స్పందించి అతడికి సీపీఆర్ చేశాడు.
కొద్దిసేపటికి అతడు సృహలోకి రావడంతో, శివకుమార్ అతడిని పక్కనే ఉన్న దవాఖానకు తరలించాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడంతో కోలుకున్నాడు. శివకుమార్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
