తట్టా, పారా పట్టారు : ట్రాఫిక్​ పోలీసులే గుంతలు పూడ్చారు

తట్టా, పారా పట్టారు : ట్రాఫిక్​ పోలీసులే గుంతలు పూడ్చారు

వెలుగు: బాలాపూర్ చౌరస్తాలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు గురువారం శ్రమదానం చేశారు. మట్టి తెప్పించి తట్టా, పారా పట్టి రోడ్డు పై ఉన్న గుంతలను పూడ్చివేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులతో రోడ్లపై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. మట్టి పూడ్చివేత అసంపూర్తిగా ఉండడంతో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. దాంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎస్​ఐ రంగారెడ్డి,  ఏఎస్​ఐ అశోక్​తోపాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.