సైబరాబాద్ ​పరిధిలోనాలుగు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ ​పరిధిలోనాలుగు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
  • భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజుల పాటు వెహికల్స్ దారి మళ్లింపు

గచ్చిబౌలి, వెలుగు: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో ఇయ్యాల్టి నుంచి నాలుగు రోజుల పాటు  ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వెహికల్స్ డైవర్షన్స్ ఇలా..

  • షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో..30న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 వరకు
  • జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్​ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో లేన్​లో వచ్చే వెహికల్స్ అమిత్​ కాటన్ మిల్​, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్​కు వెళ్లాలి.
  • బెంగళూరు నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్ కేశంపేట క్రాస్​ రోడ్, చటాన్​పల్లి రైల్వే గేట్​ మీదుగా వెళ్లాలి.
  • పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది.

31న ఇలా...

  •     పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్​రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్​మీదుగా వెళ్లాలి.
  •     సిటీ నుంచి షాద్​నగర్​కు వెళ్లే వెహికల్స్ కొత్తూరు​ వై జంక్షన్​, జేపీ దర్గా క్రాస్ రోడ్,  నందిగామ, దస్కల్​ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
  •     జడ్చర్ల నుంచి షాద్​నగర్​ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికల్స్​ వన్​వేలో వెళ్లాల్సి   ఉంటుంది.

శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. 31న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు...

  • బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వెహికల్స్ పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 1న..ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ..

  • బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వెహికల్స్ తొండుపల్లి టోల్​గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్​ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్​పాస్, గగన్​పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 2న బాలానగర్ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్ పరిధిలో..

  •  బోయిన్​పల్లి నుంచి బాలానగర్​ వైపు వెళ్లే వెహికల్స్ బోయిన్​పల్లి జంక్షన్​, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతంనగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ 
  • పైప్​లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. 
  • బాలానగర్ నుంచి బోయిన్ పల్లి వైపు వెళ్లే వెహికల్స్ సైతం ఇదే రూట్ లో వెళ్లాలి.
  • బోయిన్​పల్లి నుంచి కూకట్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ బాలానగర్ టీ–జంక్షన్ నుంచి ఫతేనగర్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా కూకట్ పల్లి వై జంక్షన్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
  • బోయిన్​పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్​పల్లి వైపు వచ్చే వెహికల్స్​ నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  • కూకట్​పల్లి నుంచి బోయిన్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాలి. 

కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్​ల పరిధిలో..

  •     బాలానగర్ ​నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్  ఒకే లేన్​లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.
  •     మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు. 
  •     కూకట్ పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను రెండు లేన్లలో అనుమతిస్తారు.
  •     జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్ ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర ఉంటుంది.  
  •     వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్​ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు.