ఇవాళ విశాఖలో రెండో వన్డే: రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ విశాఖలో రెండో వన్డే: రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖపట్టణంలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత్-విండీస్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. కోల్‌ కతా, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలను ఆనందపురం దగ్గర మళ్లిస్తున్నారు. విజయనగరం వైపు వెళ్లే వాహనాలను ఎన్ఏడీ దగ్గర దారి మళ్లించారు.

క్రికెట్ మ్యాచ్ చూడడానికి శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలను మారికవలస దగ్గర దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత  నేషనల్ హైవేలో అన్ని వాహనాలను అనుమతిస్తామని… పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులు… ఎక్కడపడితే అక్కడ  వాహనాలను పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.