
బాసరలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరి నదిలో మునిగి నలుగురు భక్తులు మృతి చెందారు. పుణ్యస్నానాల కోసం వచ్చిన యువకుల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఆదివారం ( జూన్ 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు అమ్మవారి దర్శనం కోసం వచ్చి గోదావరిలో తేలిన ఇసుక మెట్ల దగ్గర స్నానం చేస్తుండగా... అక్కడున్న లోతైన ప్రాంతంలో మునిగి గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన యువకులు హైదరాబాద్ లోని చింతల్ బజార్ నుంచి 18 మంది బృందంగా బాసరకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కు చెందిన మూడు కుటుంబాలు పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. యువకుల మరణంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.