- జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఘటన
హజారీబాగ్: జార్ఖండ్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం హజారీబాగ్ జిల్లాలోని లోత్వా డ్యామ్లో మునిగి ఆరుగురు 12వ తరగతి స్టూడెంట్లు మృతిచెందారు. విద్యార్థులు ఉదయం స్కూల్ యూనిఫాంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. స్కూల్కు వెళ్లకుండా డ్యామ్వద్దకు పిక్నిక్కు వెళ్లారు. 11 గంటల ప్రాంతంలో అక్కడ డ్యామ్లోకి దిగి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
మృతిచెందిన విద్యార్థుల వయసు 17 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటుందని వారు పేర్కొన్నారు. డెడ్బాడీలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం షేక్ భిఖారీ మెడికల్ కాలేజీకి పంపినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి పట్ల జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ సంతాపం తెలిపారు.