డ్యామ్​లో మునిగి ఆరుగురు మృతి

డ్యామ్​లో మునిగి ఆరుగురు మృతి
  • జార్ఖండ్​లోని హజారీబాగ్​ జిల్లాలో ఘటన

హజారీబాగ్: జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం హజారీబాగ్ జిల్లాలోని లోత్వా డ్యామ్‌లో మునిగి ఆరుగురు 12వ తరగతి స్టూడెంట్లు మృతిచెందారు. విద్యార్థులు ఉదయం స్కూల్​ యూనిఫాంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. స్కూల్​కు వెళ్లకుండా డ్యామ్​వద్దకు పిక్నిక్​కు వెళ్లారు. 11 గంటల ప్రాంతంలో అక్కడ  డ్యామ్​లోకి దిగి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. 

మృతిచెందిన విద్యార్థుల వయసు 17 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటుందని వారు పేర్కొన్నారు. డెడ్​బాడీలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం షేక్ భిఖారీ మెడికల్ కాలేజీకి పంపినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి పట్ల జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ సంతాపం తెలిపారు.