పెళ్లింట విషాదం.. పెళ్లి కొడుకు ప్రాణం తీసిన గిఫ్ట్

పెళ్లింట విషాదం.. పెళ్లి కొడుకు ప్రాణం తీసిన గిఫ్ట్

ఛత్తీస్ గఢ్, కబీర్ ధామ్ జిల్లాలోని ఓ పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లిలో ఇచ్చిన గిఫ్ట్ బాంబులా పేలి వరుడు, అతని సొదరుడు మరణించారు. ఆ కుటుంబంలోని మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. వివరాళ్లోకి వెళ్తే.. హేమేంద్ర మేరవి అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన అంజనా అనే యువతితో కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. బంధుమిత్రులంతా రకరకాల గిఫ్ట్ లు ఇచ్చారు. పెళ్లైన తర్వాత.. పెళ్లి కొడుకు, ఇంట్లో వాళ్లంతా కలిసి ఆ గిఫ్ట్ లన్నీ ఓపెన్ చేశారు.  అందులో ఒక హోం థియేటర్ కూడా ఉంది.

ఆ హోం థియేటర్ ని టెస్ట్ చేద్దాం అని పెళ్లి కొడుకు కనెక్ట్ చేయగా.. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పెళ్లి కొడుకు సోదరుడు రాజ్ కుమార్ కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ థియేటర్ ప్రమాదవ శాత్తు పేలిందా లేక ఇందులో ఎవరి కుట్రైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.