మహాత్మాగాంధీ మీకు ట్రైలర్ కావచ్చు.. మాకు జీవితం

మహాత్మాగాంధీ మీకు ట్రైలర్ కావచ్చు.. మాకు జీవితం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీపై విమర్శలు గుప్పించారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. మహాత్మాగాంధీ అమర్ రహే అంటూ నినదించారు . దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధాని.. అంతేనా… ఇంకా ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ, ఇది ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. వెంటనే ప్రధాని కల్పించుకుని… ఇది మీకు ట్రైలర్ మాత్రమే కావచ్చు… మాకు మాత్రం మహాత్మాగాంధీ అంటే ఒక జీవితం అని చెప్పారు.

అనంతకుమార్ హెగ్డే మహాత్మాగాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం ఒక డ్రామా అని అన్నారు. గాంధీ పోరాటానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలను చదువుతుంటే తనకు రక్తం మరిగిపోతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.