సికింద్రాబాద్, వెలుగు : గుంటూరు డివిజన్ పరిధిలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఇవ్వాల్టి నుంచి 18వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
హుబ్లీ– విజయవాడ, గుంటూరు– కాచిగూడ, గుంటూరు– సికింద్రాబాద్, గుంటూరు– మెదక్, కాచిగూడ– మెదక్, మచిలీపట్నం– మర్యాలగూడ రోడ్మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్యాసింజర్లను గమనించాలని కోరారు.