న్యూఢిల్లీ: ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్మరింత ప్రియం కానుంది. రిజర్వేషన్లు, ఈ టికెట్ల బుకింగ్పై సర్వీస్చార్జ్ విధించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. నాన్ఏసీ టికెట్లపై రూ.15, ఏసీ టికెట్లపై రూ.30 వసూలు చేయనుంది. రైల్వే బోర్డు.. ఐఆర్సీటీసీ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీంతో సెప్టెంబర్1 నుంచి సర్వీస్చార్జ్వసూలు చేయనున్నట్లు ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నట్లు వివరించింది. సర్వీస్చార్జ్ ను రైల్వేగతంలో కూడా వసూలు చేసింది. మూడేళ్ల క్రితం వరకూ నాన్ఏసీ టికెట్లపై రూ.20, ఏసీ టికెట్ల బుకింగ్పై రూ.40 వసూలు చేసింది.