కాజీపేటలో ట్రైన్ యాక్సిడెంట్‌‌ మాక్‌‌ డ్రిల్‌‌

కాజీపేటలో ట్రైన్ యాక్సిడెంట్‌‌ మాక్‌‌ డ్రిల్‌‌

కాజీపేట, వెలుగు: రైలు ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాజీపేటలో మాక్​డ్రిల్​నిర్వహించారు. సహాయక, నష్ట నివారణ చర్యలు, క్షతగాత్రులను వైద్య సాయం కోసం హాస్పిటల్​కు తరలించడం వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

రైల్వే శాఖ 2024–25 వార్షిక క్యాలండర్​లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి, ఏడీఆర్ఎం గోపాల్, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ధర్మేందర్ సింగ్, సీనియర్ డీఎస్​ఓ సురేశ్ కుమార్, కాజీపేట సీనియర్ డీఎంఈ స్వరాజ్ కుమార్, సికిద్రాబాద్, కాజీపేటకు చెందిన వివిధ విభాగాల అధికారులు, జిల్లా వైద్య, అగ్నిమాపక, పోలీస్​శాఖ అధికారులు పాల్గొన్నారు.