భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీలో గ్రూప్స్, మెయిన్స్, ఐఐటీ, జేఈఈ, నీట్కు ప్రిపేర్అయ్యే విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్సౌరభ్శర్మ శుక్రవారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఇటీవల భద్రాచలం సబ్కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ జూనియర్ కాలేజీని సందర్శించినప్పుడు విద్యార్థులు తమకు ప్రిపరేషన్ కోసం పుస్తకాలు కావాలని అభ్యర్ధించారు.
అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవసరమయ్యే పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి ట్రైనీ సబ్ కలెక్టర్ ద్వారా అందజేశారు. ఎలా ప్రిపేర్ కావాలో? విద్యార్థులకు సూచించారు. కెరీర్లో రాణించాలంటే గోల్ ఉండాలని వారికి తెలియజేశారు.
