- ట్రాన్స్కో ఉద్యోగులకు సీఎండీ కృష్ణభాస్కర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు విధులు నిర్వహించే ఉద్యోగులు ఆఫీస్ టైంలో సెల్ఫోన్లో బాతఖాని బంద్ చేయాలని హైదరాబాద్ విద్యుత్ సౌధలోని ట్రాన్స్కో ఉద్యోగులకు ఆ సంస్థ సీఎండీ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అరగంటపాటే లంచ్ బ్రేక్ తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో ఇంకా ఏమున్నదంటే.. ‘ఎమెర్జన్సీ అయితే తప్ప పర్సనల్ ఫోన్లు యూజ్ చేయరాదు.. ఒకవేళ ఎమర్జన్సీ కాల్స్ వచ్చినా బిగ్గరగా కాకుండా నెమ్మదిగా మాట్లాడాలి.
తమకు కేటాయించిన సీట్లలో కూర్చొని సమయభావం ప్రకారం పనిచేయాలి. బయట అటు ఇటు తిరగకూడదు’ అని ఆదేశించారు. సంబంధిత డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఈ విషయాలను తమ సిబ్బందికి తెలియచేసి వారితో పనిచేయించాలని ఆర్డర్లో పేర్కొన్నారు. ఏవైనా ఎలిగేషన్స్ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎండీ హెచ్చరించారు.
