24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నాం : శ్రవణ్ కుమార్​

24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నాం : శ్రవణ్ కుమార్​
  • ట్రాన్స్​కో ఎస్ఈ శ్రవణ్ కుమార్​

లింగంపేట, వెలుగు: జిల్లాలో గృహ వినియోగం, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్​కో ఎస్ఈ  శ్రవణ్​కుమార్ తెలిపారు. శనివారం లింగంపేట మండలంలోని ముంబాజీపేట సబ్​స్టేషన్​లో ఫీడర్​ బ్రేకర్​ను ఆయన ప్రారంభించారు. ఈ బ్రేకర్ వల్ల సబ్​స్టేషన్​ పరిధిలోని కంచ్​మల్​గ్రామానికి అంతరాయం లేకుండా విద్యుత్​సప్లై జరుగుతుందన్నారు. డీఈఈలు విజయసారథి, మల్లేశ్, ఇన్​చార్జి ఏఈ అశోక్, లైన్​మెన్​ పాండు, సిబ్బంది ఉన్నారు.