మాటల్లో కాదు చేతల్లో చూపించండి..జగన్ కు పవన్ సవాల్

మాటల్లో కాదు చేతల్లో చూపించండి..జగన్ కు పవన్ సవాల్

ఏపీలో గ్రామ సచివాలయ,వార్డు ఎగ్జామ్ పేపర్స్ లీకయ్యాయన్న ఆరోపణల  నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వం పాదర్శకత అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలన్నారు. యువత భవిషత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎగ్జామ్స్ రాసి ఉంటారని..వారు  ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దన్నారు. పేపర్ లీక్ పై ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణకు ఆదేశించాలన్నారు. అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ఉద్యోగులు వస్తున్నాయని అనిపిస్తుందన్నారు పవన్.