ఈ ఏడాది ట్రావెల్ థీమ్ ‘గో బిగ్’. అంటే... ‘చూడాల్సిన ప్లేస్ల లిస్ట్ పెద్దది’ అని అర్థం. వరల్డ్ ట్రావెల్, టూరిజం కౌన్సిల్(డబ్లూటిటిసి) ఈ థీమ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా రిస్ట్రిక్షన్స్ని ఎత్తేశాయి. విదేశీ టూరిస్టుల్ని రానిస్తున్నాయి కూడా. దాంతో రెండేండ్లుగా టూర్ వేయని వాళ్లు కొత్త ప్లేస్ల్ని చూసేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ల ట్రిప్ లిస్ట్లో చాలా ప్లేస్లు ఉండొచ్చు అంటున్నారు ట్రావెల్ ఎక్స్పర్ట్స్. ఇప్పడిప్పుడే మళ్లీ టూరిస్ట్ ప్లేసులు సందడిగా కనిపిస్తున్నాయి. సమ్మర్, రెయినీ సీజన్ ట్రిప్ బుకింగ్స్ ఈ వారంలో ఎక్కువ అయ్యాయని ట్రావెల్ ఏజెంట్స్, ఆపరేటర్స్ చెప్తున్నారు. ప్యాండెమిక్ తర్వాత హోటల్, ఫ్లయిట్ ఛార్జీలు తగ్గడం కూడా ట్రావెలర్స్కి కలిసొస్తుందని అంటున్నారు వీళ్లు.
ఎడ్యుకేషన్ టూర్లు
ఇంతకుముందుతో పోల్చితే టూరిస్ట్ల ఛాయిస్లు మారాయి. వాళ్ల ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే ట్రావెల్ కంపెనీలు, హోటళ్లు ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. కొన్ని హోటల్స్ కీలెస్ చెకిన్, డిజిటల్ స్టాఫ్ కమ్యూనికేషన్, రోబోస్తో రూమ్ డెలివరీ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. పేరెంట్స్ కూడా పిల్లల కోసం ఎడ్యు–వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. 3 నుంచి 17 ఏండ్లలోపు పిల్లల కోసం రెండు వారాలు ఎడ్యుకేషనల్ సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాయి పోర్చుగల్లోని కొన్ని రిసార్టులు. ఈ ఏడాది 150 శాతం మంది ఎక్కువ టూరిస్ట్లు ఫ్లయిట్లో ట్రావెల్ చేయొచ్చని అంటోంది ‘ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్’.
మునుపటిలా టూర్లకి...
‘‘ఈ ఏడాది టూరిస్ట్ల సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే... కరోనా కేసులు చాలా తగ్గిపోయాయి. చాలామంది వ్యాక్సిన్ రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు. పైగా చాలాదేశాలు ట్రావెల్ బ్యాన్ ఎత్తేశాయి. దాంతో టూరిస్ట్లు మునుపటిలా నచ్చిన ప్లేస్లను చుట్టేస్తారని నమ్ముతున్నాం” అని చెప్తోంది డబ్ల్యూటిటిసి సీఇవో జులియా సింప్సన్.