బెర్లిన్: డిప్రెషన్ కోసం ఇచ్చే ట్రీట్మెంట్లు, మనిషి మెదడును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో బ్రెయిన్ కనెక్టివిటీ పెరుగుతుందని జర్మనీలోని మ్యూన్స్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. డిప్రెషన్ ట్రీట్మెంట్తీసుకోక ముందు ఉన్న బ్రెయిన్ కనెక్టివిటీ.. చికిత్స తీసుకున్న తర్వాత మరింత పెరిగిందని వివరించారు. ఆస్ట్రియా, వియన్నాలోని యూరోపియన్ కాలేజ్ ఫర్ న్యూరో సైకో ఫార్మాకాలజీ కాంగ్రెస్లో ఈ స్టడీకి సంబంధించిన నివేదికను అందజేసినట్టు రీసెర్చర్స్ తెలిపారు. యూత్లో బ్రెయిన్ స్ర్టక్చర్ సాధారణంగానే దృఢంగా ఉంటుందని వివరించారు. డిప్రెషన్ ట్రీట్మెంట్ మనిషి మెదడు సామర్థ్యాన్ని మార్చినట్టు గుర్తించామని స్టడీ లీడ్ రీసెర్చర్ ప్రొఫెసర్ జోనాథన్ రెప్పల్ తెలిపారు. డిప్రెషన్ కోసం చేసే ట్రీట్మెంట్, బ్రెయిన్ కనెక్టివిటీ పెంచడంతో పాటు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందని వివరించారు.
109 మంది పేషెంట్లపై స్టడీ
డిప్రెషన్తో బాధపడుతున్న 109 మంది పేషెంట్స్పై స్టడీ చేశామని, తర్వాత వారి డేటాను హెల్దీగా ఉన్న 55 మందితో పోల్చామని రెప్పల్ చెప్పారు. బ్రెయిన్లో ఏ పార్ట్.. వేరేదాంతో కమ్యూనికేట్ అవుతుందో తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ చేశామని వివరించారు. డిప్రెషన్కు గురైన వారు ఎలక్ర్టోకాన్వల్సిన్ థెరపీ (ఈసీటీ) ట్రీట్మెంట్ తీసుకుంటే మరికొందరు మందులు తీసుకుంటారన్నారు. ట్రీట్మెట్కు ముందు, ఆ తర్వాత బ్రెయిన్ పనితీరును పరీక్షిస్తే.. చికిత్స తర్వాతే బ్రెయిన్ కనెక్టివిటీ పెరిగినట్టు గుర్తించామన్నారు. అదెలా పెరిగిందో చెప్పేందుకు తమ వద్ద వివరణ లేదని రెప్పల్ వివరించారు.