
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల ఉండడంతో అనంతగిరికి పర్యాటకులు ఎవరూ రావద్దని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల అధికారులను బుధవారం సమీక్ష నిర్వహించారు.
అనంతగిరి ట్రెక్కింగ్ను తాత్కాలికంగా మూసివేయడంతో అధికారులు సెలవులు లేకుండా హెడ్క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరం తప్ప బయటకు రావొద్దన్నారు.