
భద్రాచలం,వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అంకంపాలెం ఆశ్రమ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రవ్వ గీతా హర్షిణి జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైంది. సోమవారం బాలికను పీవో ప్రతీక్జైన్ తన చాంబర్లో అభినందించారు. ఈనెల 7,8 తేదీల్లో హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఛాంపియన్షిప్తో పాటు గోల్డ్ మెడల్ సాధించిన గీతా హర్షిణీ పంజాబ్లోని పాటియాలాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. జాతీయస్థాయిలో రాణించాలని పీవో ప్రతీక్ జైన్, డీడీ మణెమ్మ, ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ బాలికకు సూచించారు.