బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ

బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ

కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భూమ్ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాగ్వాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. నిండు సభ సాక్షిగా ప్రజా ప్రతినిధులమన్న విషయాన్ని మర్చిపోయి రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో తృణమూల్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ ముక్కు పగిలింది. దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్కు తరలించారు. అపొజిషన్ లీడర్ సువేందు అధికారి తనపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు. దాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారితో పాటు మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ ఏడాది చివరి వరకు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 

సభలో జరిగిన రభసకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య, పార్టీ ప్రతినిధి షెహజాద్ జై హింద్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలను తృణమూల్ నేతలు చుట్టుముట్టగా వారిని విడిపించేందుకు మార్షల్స్, పోలీసులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.