మలేషియాలో కరోనా వైరస్ తో భారతీయుడి మృతి

మలేషియాలో కరోనా వైరస్ తో భారతీయుడి మృతి

చైనాను పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా. కరోనా వైరస్ సోకి మలేషియాలో ఉంటున్న ఓ భారతీయుడు చనిపోయాడు. త్రిపుర రాష్ట్రానికి చెందిన మానీర్ హోస్సేన్ కరోనావైరస్ సోకి మలేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పూర్తాల్ రాజ్ నగర్ గ్రామానికి చెందిన మానీర్ హోస్సేన్ 2018లో ఓ రెస్టారెంట్ లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు. అక్కడ కరోనావైరస్ తో మానీర్ చనిపోయాడు. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న ఆయన తాతకు అక్కడి అధికారులు తెలిపారు.

23 ఏళ్ల తన మనవడు  రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడ పనిచేస్తూ కరోనా వైరస్ సోకి చనిపోయాడని అతని తాతైన అబ్దుల్ రహీం ఆవేదన వ్యక్తం చేశారు. తన మనవడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని అధికారులను కోరుతున్నాడు.