హైదరాబాద్: తెలంగాణ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో త్రిశూల్ మెహ్రా విన్నర్గా నిలిచాడు. గురువారం జరిగిన అండర్–19 బాయ్స్ ఫైనల్లో త్రిశూల్ 4–2తో తరుణ్ కేదార్నాథ్పై నెగ్గాడు. హోరాహోరీగా జరిగిన టైటిల్ ఫైట్లో త్రిశూల్ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు.
బలమైన స్మాష్లు, ర్యాలీలతో ప్రత్యర్థిని నిలువరించాడు. తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, గుజరాతీ సేవ మండల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.