బడ్జెట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

బడ్జెట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టి మూడు గంటలు గడవకముందే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు ఇది బడ్జెట్టేనా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.  బడ్జెట్ పై ఎన్నో  ఆశలు పెట్టుకున్నామని చివరకు తమ ఆశలన్నీ నీరు కారి పోయాయని కామెంట్ చేస్తున్నారు.  

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో బడ్జెట్ అంశం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బడ్జెట్ పై నెటిజన్స్ మీమ్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. కొన్ని సినిమాల్లోని చిత్రాలను తీసి ఫన్నీ ఫన్నీగా వాళ్లకు నచ్చింది యాడ్ చేసుకొని ట్రోల్స్ చేస్తున్నారు.  నూతన పార్లమెంట్ లో మొదటి బడ్జెట్ పై ఎన్నో ఆశాలు పెట్టుకున్నామని చివరకు తమకు చేదు బడ్జెట్ ను అందించారని వాపోతున్నారు. 

Salaried Class looking at Nirmala Sitharaman's Budget for tax reliefs #Budget2024 pic.twitter.com/zf85GmwRJR