ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థిక చిక్కుల్లో అనేక ఫ్యామిలీలు
తల్లిదండ్రుల మృతితో అనాథలుగా వందలాది మంది చిన్నారులు
వేలాది కుటుంబాల్లో విషాదం ..దయనీయంగా మారిన బతుకులు
మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన కమలయ్యగారి నగేశ్(39)కు కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో జాయిన్ చేశారు. రూ.15 లక్షల అప్పు చేసి ట్రీట్మెంట్ చేయించారు. 20 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నగేశ్ ఇటీవలే చనిపోయారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే నగేశ్ మృతితో ఫ్యామిలీ పరిస్థితి దయనీయంగా మారింది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లల చదువులు, వారి భవిష్యత్ గురించి నగేశ్ భార్య మనోవేదన చెందుతున్నారు.
వెలుగు, నెట్వర్క్: కరోనా దెబ్బకు రాష్ట్రంలోని అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయిన కొన్ని వేల కుటుంబాల భవిష్యత్ప్రశ్నార్థకంగా మారింది. ప్రాణనష్టంతోపాటు ఆయా కుటుంబాలు ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఫ్యామిలీలు ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. స్టేట్వైడ్ఇలా అనాథలుగా మారిన పిల్లలు వందల్లో ఉన్నప్పటికీ వీరి విషయంలో కేసీఆర్సర్కారు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఏపీ, తమిళనాడు ఆదర్శం
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 వరకు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి లేదా తండ్రి గతంలో వివిధ కారణాల వల్ల చనిపోయి, ఇప్పుడు మరొకరు కొవిడ్తో మరణించడం వల్ల కూడా కొందరు పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటి పిల్లల్లో చాలామంది అమ్మమ్మ, నానమ్మ ఇండ్లల్లో, బంధువుల ఇండ్లలో తలదాచుకున్నారు. ఈక్రమంలో అనాథ పిల్లల భవిష్యత్ కోసం కేంద్ర సర్కారు తాజాగా పీఎం కేర్స్నుంచి రూ.10 లక్షల కార్పస్ ఫండ్ అందజేయాలని నిర్ణయించింది. వారికి18 ఏండ్లు నిండినప్పటి నుంచి ఐదేళ్లపాటు నెలవారీ స్టైఫండ్, 23 ఏళ్లు నిండాక రూ.10 లక్షలు పీఎం -కేర్స్ నుంచి అందుతాయి. అనాథలను ఆదుకునే విషయంలో మన పొరుగున ఉన్న ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీరికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షలు ఫిక్స్ డ్డిపాజిట్చేస్తోంది. పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేదాక డిపాజిట్పై నెలనెలా 5 నుంచి 6 శాతం వడ్డీ అంటే కనీసం రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు సర్కారు, అనాథ పిల్లలకు రూ.5లక్షలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు రూ.3 లక్షల ఫిక్స్డ్డిపాజిట్చేస్తోంది. చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం స్టాలిన్ప్రటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి అనాథ చిన్నారుల భవిష్యత్గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కేవలం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో హెల్ప్లైన్ ఏర్పాటుచేసి కుటుంబసభ్యులు చేరదీయని చిన్నారులను జిల్లాకేంద్రాల్లోని ట్రాన్సిట్హోమ్స్కు తరలించి చేతులు దులుపుకొంటున్నారు.
ఇవి నిజానికి కొవిడ్ సోకిన కుటుంబాల్లోని చిన్నారులను సంరక్షించేందుకు ఏర్పాటుచేసిన సెంటర్లు. ఆ తర్వాత చిన్నారుల పరిస్థితి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఈ ట్రాన్సిట్హోమ్స్కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్లకు అనాథల నుంచి 250 కి పైగా కాల్స్ వచ్చాయని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీఎం కేర్స్కార్పస్ఫండ్అమలు కోసమైనా కేసీఆర్ సర్కారు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల గుర్తింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్గ్రామానికి చెందిన రాములు, భోజక్క వారం వ్యవధిలో కరోనాకు బలయ్యారు. వీరి ఇద్దరి కూతుళ్లు లత, సమత అనాథలయ్యారు. ఇందులో పెద్ద పాప లత మానసిక వికలాంగురాలు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన వెల్డర్చిలకల వెంకన్న ఏడాది కింద విద్యుత్ షాక్తో చనిపోయారు. అతని భార్య ఇటీవల కరోనాతో చనిపోవడంతో వారి కూతురు నేహ(5), కుమారుడు వర్షిత్ అనాథలయ్యారు. భర్త వెంకన్న చనిపోవడంతో స్వప్న పిల్లలను సాదుకుంటోంది. ఆమెకు ఏప్రిల్ లో కరోనా సోకగా గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 21న మృతి చెందింది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సాథ్నెంబర్కు చెందిన రాఠోడ్ గౌరి కరోనాతో మృతి చెందడంతో ఆమె ముగ్గురు పిల్లలు చందన (12), వందన (10) , సిద్దు(7) అనాథలయ్యారు. ఆమె భర్త ఇందర్సింగ్చాలాకాలం కిందట బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు. భర్త చనిపోవడంతో గౌరికి కోర్టులో అటెండర్ఉద్యోగం వచ్చింది. బోధ్ కోర్టులో పని చేస్తున్న ఆమెకు ఈ నెల 12న కరోనా సోకగా, రిమ్స్లో ట్రీట్మెంట్పొందుతూ చనిపోయింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు నేరడిగొండ మండలం పట్పట్ తండాలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.