అర్హులందరికీ దళితబంధు ఇస్తాం : ఎమ్మెల్యే దానం నాగేందర్

అర్హులందరికీ దళితబంధు ఇస్తాం : ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు వస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పథకం అమలు కోసం ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దళితబంధు కోసం లంచం ఇచ్చినా, తీసుకున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అదేశించారని చెప్పారు. అర్హులందరూ దళితబంధును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

మొదటి విడతలో 100 మందికి, 2వ విడతలో 500 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం వర్తిస్తుందని వివరించారు. బస్తీ వాసులతో త్వరలోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు. బంజారాహిల్స్ లోని లేక్‌వ్యూ బంజారా ఫంక్షన్‌ హాల్‌లో రెండవ విడత దళితబంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకటేష్, మన్నె కవితా రెడ్డి, స్థానిక టీఆర్ఎస్  నాయకులు పాల్గొన్నారు.