కేసీఆర్ త్రీఫేజ్ కరెంట్ లాంటోడు..ముట్టుకుంటే మాడిపోతారు

కేసీఆర్ త్రీఫేజ్ కరెంట్ లాంటోడు..ముట్టుకుంటే మాడిపోతారు

బీజేపీ సీఎంలు, జాతీయ నాయకులు సర్కస్ కంపెనీలో ఆర్టిస్టులు, జోకర్లుగా మారారని విమర్శించారు పియూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేసీఆర్ ను టచ్ చేస్తే.. తెలంగాణతో పాటు దేశం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. బీజేపీ నేతలకు కళ్లు లేవు కనుకే తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని..  బీజేపీ నేతలకు ఒంటి నిండా కుళ్లు మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు నిలదీస్తారనే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్.. మహబూబ్ నగర్ సభకు రాలేదన్నారు. కేసీఆర్ త్రీ ఫేజ్ కరెంటు లాంటోడని.. ముట్టుకుంటే మాడిపోతారన్నారు జీవన్ రెడ్డి.