డ్రగ్స్ కేసులో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి

డ్రగ్స్ కేసులో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి

బీసీలు, పేదలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అన్నీ అయిపోయాయి టీఆర్ఎస్ నేతలు ఇక  డ్రగ్స్ దందాపై పడ్డారన్నారు. టీఆరెస్ ఎమ్మెల్యేలకు రక్త పరీక్ష చేయించాలని...డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్యెల్యేలు ఎవరో కేసీఆర్ బయట పెట్టాలన్నారు. మూడేళ్ళ కిందటి డ్రగ్స్ కేసు ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. రక్త పరీక్షలకు మేము సిద్ధమని...కేసీఆర్ తో పాటు టీఆరెస్ ఎమ్యెల్యేలు సిద్ధమా అన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న  ఎమ్మెల్యేలపై సీఎం స్పందించకపోవడం సిగ్గు చేటు అని..డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించాలన్నారు. ఇద్దరు ఎమ్యెల్యేలు నాగార్జున సాగర్ లో ప్రచారం చేస్తున్నారట అని..హైదరాబాద్ ను అడ్డా చేసుకుని టీఆరెస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేయడం సిగ్గుచేటు అన్నారు. 50 శాతం బీసీలు ఉన్న రాష్ట్రంలో కేవలం నలుగురు మాత్రమే మంత్రులున్నారని తెలిపారు. ఉన్న నలుగురు బీసీ మంత్రులు మేమె ఉద్యమకారులం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక బీసీ  నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా అన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే వంద కోట్లు .. వెయ్యి కోట్లు అనడం తప్పా.. ఇవ్వరన్నారు. బీసీల పొట్ట కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. 
కుల వృత్తులను దెబ్బ తీసే పార్టీ ఎంఐఎం పార్టీ అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరని..గీత కార్మికులను ప్రోత్సహిస్తా అంటూనే పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారన్నారు.  కుల సంఘాల నాయకులు ఎంపీలు మంత్రులు అయి...కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతున్నారన్నారు.

పేదలను ఆదుకోవాలని కేంద్రం గుర్తించింది కానీ...కేసీఆర్ హైదరాబాద్ లో వరదలు వస్తే, కనీసం బయటికి వచ్చి చూడలేదన్నారు. కేవలం పేదల ఇండ్లు మునిగిపోయాయి కాబట్టే రాలేదని.. మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్ అన్నారు. పేదోళ్ల రక్త మడుగులో సీఎం కేసీఆర్ రాక్షస పాలన చేస్తున్నారని...రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోయారో లెక్క ఇవ్వలేదన్నారు.
టెస్టుల సంఖ్యను తగ్గించి చూపించారని.. మోడీగారి పిలుపు మేరకు రాష్ట్రంలో బీజేపీ నేతలు కోవిడ్ టైంలో చాలా మంది సేవలు చేశారన్నారు. ప్రతి సమస్యను గుర్తించి పని చేయాలి...తెగించి కొట్లాడాలన్నారు. 2023 లక్ష్యం చేరే వరకు బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని..కేవలం గుర్తింపు కోసమే పని చేయొద్దు...ప్రజల కోపం కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తదన్నారు బండి సంజయ్.